టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు ఇలియానా వెలిగింది. దీంతో ఇక్కడ అవకాశాలు ఎక్కువ రావటం మరియు పాపులారిటీ పెరగటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి మకాం మార్చేసింది. అక్కడ ఇలియానా చాలా అవకాశాలు పొందుతున్న కానీ సరైన విజయం దక్కడం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ సౌత్ వైపు ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రావటానికి గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఇలియానా తన ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.


గతంలో వీరిద్దరు కలిసి డేటింగ్ చేసిన తాజాగా ఇటీవల విడిపోయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. క్లారిటీ గా మాట్లాడాలంటే ఇలియానా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆండ్రూ నీబోన్ అకౌంట్ ని అన్ ఫాలో చేయడం తో పాటుగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను తన అకౌంట్ నుండి తొలగించింది. దీంతో ఇలియానా అభిమానులు వీరిద్దరూ విడిపోయారనే నిర్ధారణకు వచ్చేశారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా సెల్ఫ్ లవ్ కొటేషన్స్ పెట్టడంతో విషయం జనాలకు అర్ధమైంది. ఆమె వేదాంత ధోరణిలో పోస్ట్ లు పెట్టడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.


అయితే తాజాగా ఆమె చేసిన ఫన్నీ ట్వీట్ అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది. ''నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో.. ఉండే ఉంటుంది. నా కాళ్లపై కనిపిస్తోన్న గాయాలు, వాటి తాలూకు మచ్చలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది. బహుసా ఫ్రిడ్జ్ లో ఉన్న స్నాక్స్ తినడానికి అర్ధరాత్రి ట్రిప్ వేశానేమో.. నేనో స్లీప్ వాకింగ్ స్నాకర్ ని'' అంటూ ట్వీట్ చేశారు.అదే విధంగా.. 'నేనొక మూర్ఖురాలిని' అంటే అర్ధరాత్రి స్నాక్స్ తినే పిచ్చిదాన్ని అంటూ మరో ట్వీట్ చేసింది. దేనికి ప్రతిస్పందనగా అభిమానులు ఫన్నీ కామెంట్స్ తో రిప్లై ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: