టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ 26వ సినిమాగా ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే 27వ సినిమా గురించి కొద్దిరోజలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

కొన్నాళ్ల క్రితం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో మహేష్ సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు ప్రచారం అయితే, ఆ తరువాత  పరశురాంతో అంటూ మరొక వార్త ప్రచారం అయింది. ఇక మూడు రోజుల క్రితం కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మహేష్ బాబును ఆయన స్వగృహంలో కలిసి దాదాపుగా మూడు గంటలపాటు ఒక కథ వివరించారని, ఆ కథ మహేష్ కు నచ్చడంతో, ఆ స్టోరీ విషయమై వారిద్దరూ ఎంతో డీప్ గా చర్చించారని అంటున్నారు. అంతేకాక ఆ సినిమా విషయమై అతి త్వరలోనే ప్రకటన రానుందని అంటున్నారు. అలానే మంచి పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పవర్ఫుల్ రోల్ లో కనపడనున్నట్లు సమాచారం. 

అయితే ప్రశాంత్ తో మహేష్ సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని, అందువలన మహేష్ కొద్దిరోజుల వరకు మిగతా డైరెక్టర్లను కలిసే అవకాశం లేదని అంటున్నారు. ప్రశాంత్ సినిమా ఓకే అవడం వల్లనే మహేష్ కూడా మిగతా డైరెక్టర్ల విషయం ప్రక్కన పెట్టారని ఫిలిం నగర్ లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ మహేష్, ను ప్రశాంత్ కలవడం, కథ చెప్పడం నిజమే అని అంటున్నారట మహేష్ సన్నిహితులు. మరి మహేష్, ప్రశాంత్ నీల్ సినిమా వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఆగాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: