అర్జున్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. అంతేకాదు కబీర్ సింగ్ కూడా బాలీవుడ్ లో ఒక సెన్షేషన్ ని క్రియోట్ చేసింది. ఏకంగా ఈ సినిమాలతో డైరెక్టర్ గా సందీ రెడ్డి తో పాటు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కియారా అద్వాని స్టార్స్ గా ఒక రేంజ్ ని తెచ్చిపెట్టేలా చేసింది. ఇక కొన్నిరోజుల క్రితం మహేష్ బాబుకు ఓ లైన్ చెప్పానని, ఆయనతో స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వయంగా ప్రకటించాడు. తను చెప్పిన కథ ఓ డార్క్ క్రైమ్ స్టోరీ జానర్ కు చెందినదనే విషయాన్ని కూడా అప్పట్లో సందీప్ రెడ్డి బయటపెట్టాడు. కట్ చేస్తే, ఆ తర్వాత సందీప్-మహేష్ ల మధ్య చర్చలు ఆగిపోయాయి. ఇక ప్రస్తుతం సందీప్ కబీర్ సింగ్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా హిందీలోనే ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో మహేష్ కు చెప్పిన కథనే ఇప్పుడు హిందీలో తీయబోతున్నాడట.

రీసెంట్ గా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి మధ్య కథా చర్చలు జరిగాయని తెలుస్తోంది. గతంలో మహేష్ కు చెప్పిన డార్క్ క్రైమ్ స్టోరీనే రణబీర్ కు చెప్పాడట సందీప్. స్టోరీలైన్ నచ్చడంతో రణబీర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి కాంబోలో సినిమాపై అధికారికంగా ప్రకటన రాబోతోంది. సందీప్ రెడ్డి నిజానికి కబీర్ సింగ్ తర్వాత తెలుగులోనే సినిమా చేయాలనుకున్న విషయం తెలిసిందే. 

అయితే కబీర్ సింగ్ భారీ విజయం సాధించడంతో ఆయనకు బాలీవుడ్ హీరోల నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. పైగా తన నెక్ట్స్ సినిమాను మరింత బోల్డ్ గా తీస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బాలీవుడ్ క్రిటిక్స్ కు కబీర్ సింగ్ టైం లో సవాల్ విసిరాడు కూడా. అంతేకాదు క్రిటిక్స్ పేర్లు చెప్పి మరీ ఈ సవాల్ విసరడం సంచలనమైంది. అందుకే డెవిల్ సినిమాను మరింత బోల్డ్ గా, రఫ్ గా తీయబోతున్నాడు సందీప్ రెడ్డి. ఈ సంగతి పక్కనపెడితే.. మహేష్ రిజెక్ట్ చేయడంతోనే ఆ కథను ఇలా హిందీలో ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి. అన్నట్టు ఈ మూవీతో బాలీవుడ్ కు నిర్మాతగా కూడా పరిచయమవ్వాలనుకుంటున్నాడట సందీప్. ఒకవేళ బాలీవుడ్ లో ఈ సినిమా కూడా సక్సస్ అయితే సందీప్ ఇక తెలుగు చిత్ర పరిశ్రమను వదిలేసినట్టే.  



మరింత సమాచారం తెలుసుకోండి: