'నిను వీడని నీడను నేనే' వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తెనాలి రామకృష్ణ బి,ఏ,బి,ఎల్". హన్సిక మోత్వానీ హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించింది. శ్రీ నీలకంటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై  రామాంజనేయులు సమర్పణలో జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుక  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.  ఈ సమావేశంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ హన్సిక మోత్వానీ, దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి, నటులు అనంత్, అశోక్ కుమార్, గిరిధర్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎడిటర్ చోట కె.ప్రసాద్, మాటల రచయితలు భవానీ ప్రసాద్, నివాస్, ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్ సీతారామరాజు మల్లెల, సహా- నిర్మాతలు రూపా జగదీశ్, ఇందుమూరి శ్రీనివాసులు, చిత్ర నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.. అనంతరం సందీప్ కిషన్, హన్సిక సంయుక్తగా  తెనాలి రామకృష్ణ టీజర్ ను రిలీజ్ చేసారు. 


హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాగేశ్వర్ రెడ్డి మీద వున్న నమ్మకంతో అతని స్నేహితులు ఈ చిత్రాన్ని నిర్మించినందుకు వారికి నా థాంక్స్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఫస్ట్ టైం సిన్సియర్ గా నా పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిదే.. ఈ సినిమాకి ఆయన దొరకడం నా అదృష్టం. ఎమోషన్స్ తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే వుంటారు.  సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం ఆయ‌న మొత్తం 75 చిత్రాలు పూర్త‌వుతాయి అన్నారు.ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసారు దర్శకుడు. హ‌న్షిక గురించి చెబుతూ...  హన్సికతో వర్క్ చేయడం అమేజింగ్ గా అనిపించింది. సెట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది తను. త‌ను ఉంటే అంతా త‌న చుట్టూ ఉండేవాళ్లంతా పాజిటివ్‌గా ఉంటార‌ని అన్నారు. ఆమె పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంతే కాక స్టేజ్ మీద హ‌న్సిక‌కు ఐ ల‌వ్ యు  హ‌న్సిక అని కూడా అన్నారు. అది ఆయ‌న ఏ అర్ధంతో చెప్పినా బ‌హుశా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ హీరో కూడా హీరోయిన్‌కు డైరెక్ట్‌గా అలా స్టేజ్ మీద చెప్పిఉండ‌రేమో అంటున్నారు కొంద‌రు సినీ పెద్ద‌లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: