బిగ్ బాస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. బిగ్ బాస్ సీజన్ ౨ లో ఇచ్చిన నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ ౨ లో కంటెస్టెంట్స్ ఏవైతే తప్పులు చేశారో, అచ్చం అలాంటి తప్పులే బిగ్ బాస్ తో పాటు ఇంటి సభ్యులు కూడా చేశారు. ముందుగా బిగ్ బాస్ చేసిన తప్పేంటంటే కంటెస్టెంట్స్ కి నచ్చని వారు త్యాగాలు చేయాలని చెప్తే షోలో మజా వస్తుంది.


నచ్చిన వారు ఏదో విధంగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నచ్చని వారిని త్యాగం చేయాలని అడిగినపుడే అక్కడ వారిద్దరి మధ్య జరిగి ఆసక్తిగా మారుతుంది. ఇంత చిన్న విషయం బిగ్ బాస్ ఎందుకు మర్చిపోయాడో తెలియదు. ఇక రెండోది, బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ అందరూ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు గెలవడానికి వచ్చారా లేదా పిక్నిక్ కి వచ్చారా అనే సందేహం కలగక మానదు.


ప్రతీ ఒక్కరూ త్యాగాలు చేసేస్తాం అని రెడీ అయిపోతుంటే నామినేషన్స్ లో ఎవరుంటారు? పోయిన సీజన్ లో ఇదే విషయంలో నాని కంటెస్టెంట్స్ కి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. మరి దీని మీద నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.ఇక మరో విషయం, హౌస్ మేట్స్ డబుల్ గేమ్ ఆడటం. వరుణ్ కి హిమజ అంటే ఇష్టం లేదు. అయినా ఆమె కోసం త్యాగం చేస్తాడు. అలాగే మహేష్ శివజ్యోతిని నామినేట్ చేస్తానని చెప్తాడు.


నామినేషన్స్ కి వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి ఆమెని నామినేట్ చేద్దామని వరుణ్, వితికాలతో డిస్కస్ చేస్తాడు. అలా చెప్పినవాడు ఆమెని సేవ్ చేయడం కోసం  జుట్టుకి రంగు ఎందుకు వేసుకున్నాడో అర్థం కాలేదు. ఇదంతా చూస్తుంటే వాళ్ళంతా డబల్ స్టాండర్డ్స్ తో గేమ్ ఆడుతున్నారని అర్థం అవుతుంది. మిగిలిన వారిలో ఈ రోజు ఎవరెవరు నామినేషన్స్ లోకి వస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: