లేడి సూపర్ స్టార్ విజయశాంతి సూపర్ స్టార్ మాహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. విజయశాంతి సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడు  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.కొంత కాలంలోనే అగ్ర కథానాయిక ఎదిగారు .  తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కర్తవ్యం సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటీ అవార్డును అందుకున్నారు. 1990 లో అగ్ర హీరోలకు సమానంగా పారితోషకం అందుకున్నారు.కర్తవ్యం సినిమాకు కోటి రూపాయలు పారితోషకంగా అందుకున్నారు.  1998 తరువాత రాజకీయాల్లో జాయిన్ అయ్యారు.2004 లో సినిమలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లో బిజీగా అయ్యారు 

విజయశాంతి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సినిమా తీసే విధానం మరియు షూటింగ్ దగ్గరి పరిస్థితులు చాలా మారిపోయాయి. అప్పుట్లో నాతోటి నటీనటులు దాదాపుగా సంవత్సరాలనికి 17-18 సినిమాల్లో నటించేవాళ్లం.ఒక్కోసారి ఉదయం షూటింగ్ కి వెళితే మళ్లీ ఉదయం వరకు  దాదాపు 24 గంటలు కష్టపడి పని చేసే వాళ్లం, నిద్ర సరిగా ఉండేది కాదు.దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో విజయశాంతి కావాలనేవారు. కానీ డేట్స్ కుదరక సినిమాలను వదిలేశాను.దర్శకనిర్మాతలకు చాలా గౌరవం ఇచ్చేవాళ్లం .సినిమాపై  మక్కువ ఉండేది కానీ ప్రస్తుత హీరోయిన్లు తమ నటనతో  జనాలను మెప్పించడం లేదు. వాళ్లలో క్రమశిక్షణ కోరవడింది  అని  విజయశాంతి అన్నారు.


ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు  సినిమాలో  ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు, రామ బ్రహ్మమ్ నిర్నాతలుగా  వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.2020 సంక్రాంతి కానుక గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: