టాలీవుడ్ లో యూత్  ప్రధాన కథాంశంగా తీసుకొని వచ్చిన మూవీ ‘హ్యాపీడేస్’.  ఈ మూవీతో వరుణ్ సందేష్, నిఖిల్, తమన్నా పరిచయం అయ్యారు..ప్రస్తుతం కొనసాగుతున్నారు.  అయితే వరుణ్ సందేశ్ కొంత కాలంగా సినిమాలకు దూరమైనా..ప్రస్తుతం బిగ్ బాస్ 3 తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  సినీ పరిశ్రమలో నిఖిల్ కి అదృష్టం బాగా కలిసి వచ్చింది.  స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ ఇలా వరుసగా మంచి హిట్స్ కలిసి వచ్చాయి. 

నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో 'కార్తికేయ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఒక దేవాలయం చుట్టూ తిరుగుతుంది..సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చి ఈ మూవీ నిఖిల్ కి మంచి విజయాన్ని అందించింది. అప్పటి నుంచి వరుసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ - నిఖిల్ రంగంలోకి దిగారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ విషయం గురించి టాలీవుడ్ లో ఎప్పటి నుంచో చర్చలు అవుతున్నా..పట్టాలు మాత్రం ఎక్కలేదు. 

ఈ నేపథ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను ‘కార్తికేయ 2’ సీక్వెల్ గా నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అక్టోబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. అయితే ఈ మూవీలో  'శ్రుతి శెట్టి'ని హీరోయిన్ గా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇది ఫేక్ న్యూస్ అని..ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా నిర్ణయించలేదని చిత్ర యూనిట్ అంటుంది. కొంతకాలంగా సక్సెస్ కి దూరమైన చందూ - నిఖిల్ ఇద్దరూ కూడా 'కార్తికేయ 2'తో మళ్లీ హిట్ కొడతారేమో చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: