'అల వైకుంఠపురములో'..  ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన బన్నీ,  తన  స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు.  కాగా ఈ సినిమా  తరువాత షెడ్యూల్ కోసం చిత్రబృందం అతి త్వరలో పారిస్‌ కు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలోని  రెండు సాంగ్స్ ను  పారిస్ లో  తీయనున్నారని తెలుస్తోంది.  అయితే  ఈ సాంగ్స్ కోసం బన్నీ న్యూ లుక్ లో కనిపిస్తాడట. ఇప్పటికే న్యూ లుక్ బన్నీ కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా టీజర్ ను  మొదట నవంబర్ 7న  త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా  విడుదల చేయనున్నా  ఆ తరువాత మనసు మార్చుకుని..  అక్టోబర్  8న దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.  ఇక వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఇక  ఈ సినిమా  డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా..  శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా  రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం.  బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  పైగా  ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. 

 

అందుకే ఈ చిత్రానికి  ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు.   ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  పూజా హెగ్డే ఇప్పటికే  డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.  కాగా  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  కాగా ఇప్పటికే ఈ సినిమాకి తమన్,  ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట.  బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో  ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని  తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: