టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్ తర్వాత ‘లీడర్ ’ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా.  మొదటి సినిమా రాజకీయ నేపథ్యంలో వచ్చినా..తన నటనతో అందరి మనసు దొచాడు రానా.  ఈ మూవీ తర్వాత వచ్చిన రెండు మూడూ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సినీ పరిశ్రమలో స్టార్ డమ్ కోసం ఆరాట పడకుండా తనకు నచ్చిన ఏ పాత్రలోనైనా నటించి మెప్పిస్తున్నాడు రానా.

ఈ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి , బాహుబలి 2’ లో విలన్ గా నటించాడు.  అయితే ఈ రెండు మూవీస్ లో రానాకు మంచి పేరు కూడా వచ్చింది.  తర్వాత తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు..నేనే మంత్రి ’ సినిమాలో హీరోగా నటించి మంచి విజయం అందుకున్నాడు.  ఇక నేను శైలజ, నేను లోకల్ తర్వాత మహానటి లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  మహానటి విజయం తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ కి వరుస ఛాస్సులు వస్తున్నాయి.

తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీకి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి.ప్రస్తుతం ఈ బ్యూటీ 'మిస్ ఇండియా' అనే విమెన్ సెంట్రిక్ సినిమాలో నటిస్తోంది.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఈ మద్య రిలీజ్ చేశారు. నటుడు రానా దగ్గుబాటి ఓ కొరియన్ సినిమా రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నాడు.

ఈ రీమేక్ లో కీర్తి సురేష్ ని ప్రధాన పాత్రలో తీసుకోవాలని భావించాడు.ఇందులో కీర్తి సురేష్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్ట్ తో కీర్తి సురేష్ ని సంప్రదించగా ఆమె సున్నితంగా తీరస్కరించిందట. దాంతో కీర్తికి బదులు మరో నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నందిని రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: