అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో'. నా పేరు సూర్య వచ్చి సంవత్సరం కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. అయితే ఈ సంవత్సరం థియేటర్లలోకి రాదు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అందుకే ఎప్పుడెప్పుడా అని టీజర్ కోసం చూస్తున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే దసరా సందర్భంగా ఈ టీజర్ విడుదల ఉంటుందని కొన్నాళ్ళగా వార్తలు వచ్చాయి. అయితే అది గాలి వార్తగానే మిగిలేలా ఉంది.

దర్శకుడు త్రివిక్రమ్ కు టీజర్ కటింగ్ మీద దృష్టిపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతి విడుదల టార్గెట్ గా రెడి అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడకూడదని ప్లాన్ చేస్తున్నారు. అలా వాయిదా వేస్తే, మహేష్ సినిమాను ఢీకొనలేక వాయిదా పడింది అన్న ట్రోలింగ్ లు, గాసిప్ లు మొదలవుతాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా యాభైశాతం మాత్రమే పూర్తయింది.

అందుకే శరవేగంగా షూట్ కంప్లీట్ చేస్తున్నారు. అన్నపూర్ణలోని టబు ఇంటి సెట్ లో షూటింగ్ అవుతోంది. థమన్ ఓ పాటకు ఇంకా ట్యూన్ ఇవ్వాల్సివుంది. ఇప్పుడు ఆ ట్యూన్ చాలా అర్జెంట్ అని తాజా సమాచారం. టీజర్ కటింగ్ వ్యవహారం ఇప్పుడు పెడితే, ఆ ట్యూన్ లేటవుతుంది. అందుకే 'అల' టీజర్ ను దసరాకు ఇవ్వడానికి వీలుకాకపోతే, దీపావళి ఇవ్వాలని చూస్తున్నారు. దీపావళి అయితే అక్టోబర్ ఎండింగ్ లో వస్తుంది. అంటే రెండు నెలల ముందుగా టీజర్ రిలీజ్ చేసినట్టవుతుంది. అందుకే దసరాకు అల టీజర్ వస్తుందా? అన్నది కాస్త అనుమానంగా వుంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: