ఈరెండు సినిమాలే కాకుండా అల్లు అర్జున్ 20వ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ మూవీ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటించనుంది. ఆమె ఈపాత్రలో నటించనుడడం ఇదే మొదటి సారి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల వైకుంఠపురములో .. అనే చిత్రంలో నటిస్తున్నాడు. వీలైనంత తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి బన్నీ,సుకుమార్ సినిమా తో బిజీ కానున్నాడు. ఇక అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ఆర్య సూపర్ హిట్ ఆవ్వగా ఆర్య 2 పర్వాలేదనిపించింది. మరి ఈ మూడో చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.