ఛలో తో టాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇచ్చి  మొదటి సినిమాతోనే  సూపర్ హిట్ కొట్టింది కన్నడ బ్యూటీ రష్మిక  మందన్న.  ఇక అప్పటినుండి  వరుస సినిమాలతో  బిజీ  గా ఉంటుంది ఈ హీరోయిన్.  ప్రస్తుతం  రష్మిక తెలుగులో  పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తుంది. అందులో భాగంగా  సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  సరిలేరు నీకెవ్వరు లో అలాగే  యంగ్ హీరో  నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో  రూపొందుతున్న భీష్మ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. 



 ఈరెండు సినిమాలే కాకుండా  అల్లు అర్జున్ 20వ సినిమాలో కూడా  రష్మిక హీరోయిన్ గా నటించడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ మూవీ  అక్టోబర్ 3న  ప్రారంభం కానుంది.  రాయలసీమ  బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక  పల్లెటూరి అమ్మాయిగా నటించనుంది.  ఆమె ఈపాత్రలో  నటించనుడడం ఇదే మొదటి సారి.   ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నాడు.  వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.   



ప్రస్తుతం అల్లు అర్జున్ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల వైకుంఠపురములో .. అనే చిత్రంలో నటిస్తున్నాడు. వీలైనంత తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి  బన్నీ,సుకుమార్ సినిమా తో బిజీ కానున్నాడు.  ఇక అల్లు అర్జున్ -సుకుమార్  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు  వీరి కలయికలో వచ్చిన  ఆర్య  సూపర్ హిట్ ఆవ్వగా ఆర్య 2 పర్వాలేదనిపించింది.  మరి ఈ మూడో చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: