తెలుగు సినిమాల మార్కెట్ బాగా పెరిగిపోయింది. బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచిన రాజమౌళి మరో సినిమాతో రంగం సిద్ధం చేస్తున్నాడు. బాహుబలి సినిమా విజయం తెలుగు సినిమాల క్రేజ్ ని అమాంతం పెంచేసింది. ఆ సినిమా ద్వారానే ప్రభాస్ నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. రీసెంట్ గా వచ్చిన సాహోకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్లలో దుమ్ము దులిపింది.


అంతే కాదు బాలీవుడ్ లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా లాభాల బాటలోకి వెళ్ళింది. ఈ విజయంతో బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ నేషనల్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. అయితే సాహో సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న చిత్రం మెగాస్టార్ నటించిన "సైరా". సాహో ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా పోస్ట్ ప్రొడ్క్షన్ పనుల్ని మరింత జాగ్రత్తగా చేస్తున్నారు.


అయితే తెలుగులో సూపర్ స్టార్లయిన మహేష్ , బన్నీలకి నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబుకి బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆయన ఒప్పుకోలేదు. చాలా రోజులుగా మీడియా నుండి బాలీవుడ్ లో సినిమా ఎప్పుడుంటుంది అనే ప్రశ్న వస్తున్నప్పటికీ, ఇప్పట్లో ఉండదని చెప్తూ వస్తున్నాడు. అయితే మహేష్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్యాన్ ఇండియా సినిమా తీస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.


ఇక బన్నీ విషయానికి వస్తే తెలుగుతో పాటు మళయాలంలో కూడా ఒకేలా క్రేజ్ ఉన్న నటుడు. అంతే కాదు బన్నీ నటించిన సరైనోడు, డీజే సినిమాల హిందీ అనువాదలకి యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసాయి. దీంతో నార్త్ లో ఆయన సినిమాలకు క్రేజ్ ఉందనే తెలుస్తుంది. మరి బన్నీ, మహేష్ ల ప్యాన్ ఇండియా మూవీ గురించి ఇటు తెలుగు అభిమానులతో పాటు, నార్త్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: