ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో వరుసగా హిట్లు కొట్టాడు వరుణ్ తేజ్. మధ్యలో వచ్చిన అంతరిక్షం సినిమా ప్లాప్ అయినా మంచి ప్రయోగంగా ఆ సినిమాకు పేరొచ్చింది. మరో రెండు రోజుల్లో వరుణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వాల్మీకి సినిమా విడుదల కాబోతుంది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ ఈ సినిమాకు ఎందుకో విడుదలకు ముందు ఆశించిన బజ్ రావట్లేదు. 
 
హైదరాబాద్ లాంటి మేజర్ ఏరియాలో బుక్ మై షో వెబ్ సైట్లో వాల్మీకి సినిమాకు అడ్వాన్ బుకింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ బుకింగ్స్ ఎందుకో ఆశించిన స్థాయిలో లేవు. కెరీర్ మొదటి నుండి క్లాస్ పాత్రలే చేసిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా హిట్టైతే వరుణ్ కు మాస్ ఇమేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం విడుదలై హిట్టైన జిగర్తాండ సినిమాకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతోంది. 
 
తమిళంలో బాబీ సింహా నటించిన పాత్రలో తెలుగులో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. సిద్దార్థ్ నటించిన పాత్రలో అథర్వ నటిస్తున్నాడు. పూజా హెగ్డే పాత్ర ఈ సినిమాలో కొంత సమయం మాత్రమేనని తెలుస్తోంది. తమిళంలో విడుదలై హిట్టైన సినిమా కావటంతో ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూసేసారని సమాచారం. మరి ఒరిజినల్ కు వాల్మీకికి మార్పులు చేసారో లేదో అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
మరోవైపు రెండు వారాల్లో సైరా సినిమా విడుదలవుతూ ఉండటం కూడా ఈ సినిమాపై ఆశించిన బజ్ క్రియేట్ కాకపోవటానికి కారణంగా తెలుస్తోంది. రెండు మెగా ఫ్యామిలీకి చెందిన సినిమాలు కేవలం 12 రోజుల గ్యాప్ తో విడుదలవుతూ ఉండటం కూడా వాల్మీకి సినిమాకు కొంత సమస్యగా మారింది. వాల్మీకి సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బుకింగ్స్ లో జోష్ పెరిగే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: