మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా అక్టోబర్ రెండో తారీకు న విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి అని అభిమానులు సోషల్ మీడియాలో తెగ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా విడుదలైన సైరా సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో సినిమా గురించి అనేకమైన విషయాలు చెప్పుకొచ్చారు సినిమా యూనిట్. ఈ సినిమాలో డైలాగులు రాసిన పరుచూరి బ్రదర్స్ తన కెరియర్లోనే మరే సినిమాకి ఈ విధంగా డైలాగులు రాయలేదని అంత అద్భుతంగా సైరా సినిమా కి డైలాగులు రాయటం జరిగిందని ఇది నా అదృష్టమని అన్నారు.


సైరా నరసింహారెడ్డి సినిమాకి డైలాగ్స్ రాసినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి బ్రదర్స్. కచ్చితంగా సైరా నరసింహారెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తాడు అని తెలిపారు. సౌత్ రీజియన్ లో తెలుగు ప్రాంతాలలో మొట్టమొదటిసారి దేశం కోసం పోరాడిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చిరంజీవి పాత్ర గురించి చెప్పుకొచ్చారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.


అంతేకాకుండా చిరంజీవి గారితో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి చాలా వరకు నేర్చుకున్నానని అసలు చిరంజీవి గారి డెడికేషన్ చూస్తే నాకు మతి పోయింది ఇప్పుడు వరకు నేర్చుకున్నది నథింగ్ అనేలా అనిపించింది సినిమా కోసం చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు అని పేర్కొన్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ముఖ్యంగా నిర్మాత రామ్ చరణ్ గురించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఆశక్తిగా సినిమా కోసం పని చేశారని...చరణ్ లేకపోతే సినిమా లేదని డైరెక్టర్ సూరి తెలిపారు. కాగా మరో పక్క సైరా సినిమా ట్రైలర్ అఫీషియల్ గా విడుదల కాకముందే సోషల్ మీడియాలో లీక్ అయింది ట్విటర్లో వైరల్ అవుతున్న ట్లు సమాచారం.  





మరింత సమాచారం తెలుసుకోండి: