మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసిం హా రెడ్డి ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలున్నాయి.


అయితే ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు తీయాలంటే అందరు రాజమౌళి పేరే చెబుతారు. కాని తెలుగు పరిశ్రమలో తాను మరో రాజమౌళి అయ్యేలా ఉన్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. బాహుబలితో రాజమౌళి సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ఆయన.


రాజమౌళి ప్రతి సినిమా సక్సెస్సే.. అయితే సూరి రాజమౌళి అవగలడా అంటే మిగతా సినిమాల విషయం ఏమో కాని కచ్చ్తీంగా సైరాతో బాహుబలి రేంజ్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. సైరా ట్రైలర్ లో ఆ భారీతనం కనిపిస్తుంది. సినిమా ఆశించిన స్థాయిని అందుకుంటే సురేందర్ రెడ్డి కూడా ఇండియన్ డైరక్టర్స్ లో క్రేజీగా మారతాడు.


సురేందర్ రెడ్డికి సైరా లాంటి భారీ సినిమా చేయడం కెరియర్ లో మొదటిసారే.. కాని ట్రైలర్ చూస్తే మొదటి ప్రయత్నమే అదరగొట్టేలా చేశాడనిపిస్తుంది. సినిమా కాస్టింగ్.. యాక్షన్.. టేకింగ్ అన్ని హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. అన్నిటిని మించి చిరు ఎనర్జీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా అందరు క్రేజీ స్టార్స్ సైరాలో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తే సైరాతో మెగాస్టార్ తన నట విశ్వరూపం చూపించారని అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ కు అక్టోబర్ 2న పండుగ చేసుకోవడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: