టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ సాధించగా, నేడు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కు వీక్షకులు విపరీతంగా బ్రహ్మరధం పడుతున్నారు. మెగాస్టార్ అదరగొట్టే డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన ఈ ట్రైలర్, సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. 

ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కాసేపటి క్రితం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్ వి ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ట్రైలర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. మెగాస్టార్ హీరోగా మరియు రామ్ చరణ్ నిర్మాతగా కలిసి ఎంతో కసిగా చేసిన ఈ ప్రాజెక్ట్, తప్పకుండా మంచి సక్సెస్ సాధించాలని ఈ సందర్భంగా రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ చెప్పారు. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి మీడియాతో కాసేపు ముచ్చటించారు. అయితే అందులో ఒక విలేఖరి మాట్లాడుతూ, 

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సమయంలో పవర్ స్టార్ గారు వాయిస్ ఓవర్ అందించారు కదా, అది కేవలం అంతవరకు పరిమితమేనా లేక ఆయన సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారా అని అడగ్గా, అవును ఆయన ఈ సినిమాలో కూడా చాలా సీన్స్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అని చరణ్ చెప్పగానే, ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా విపరీతమైన హర్షద్వానాలతో మారుమ్రోగింది. దీనిని బట్టి రేపు సైరా సినిమాకు వెళ్లిన మెగాఫ్యాన్స్ కు మెగాస్టార్ స్క్రీన్ పై కనపడడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో పవర్ స్టార్ వినపడతారన్నమాట. ఈ వార్త నిజంగా మెగా ఫ్యాన్స్ లో ఎంతో జోష్ నింపగా, ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేస్తోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: