సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'సైరా '.  అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా పలు భారతీయ భాషలలో రిలీజ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా 270 కోట్ల తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతమందించారు. ఇక ఈ సినిమా పబ్లిసిటి విషయంలో కొత్త కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమాకి క్రేజ్ ఎలా వస్తుంది అన్న సందేహం చాలామందికి వస్తోంది. 

నయనతార కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్, విజయ్ సేతుపతి కూడా సూపర్ హీరో. మరి ఈ ఇద్దరు నటించిన సైరా నరసింహారెడ్డికి తమిళనాట వీళ్ళ క్రేజ్ ఎంతవరకు పనికొస్తుందో అనేది సైరా సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. సైరాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించాడు. ఇంకా ప్రమోషన్స్ మొదలెట్టని సైరా టీంకి నయనతార ముందునుంచి షాకిస్తూనే ఉంది. వచ్చే ఆదివారం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా నయన్ వస్తుందా..! అంటే నమ్మకం లేదు. చరణ్ పర్సనల్ రిక్వెస్ట్ ను కూడా నయన్ పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాని తమిళనాట నిర్వహించే మీడియా సమావేశాలకైనా నయనతార వస్తుందా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. 

ఇక విజయ్ సేతుపతి మాత్రం సైరా ఈవెంట్స్ అన్నిటికి హాజరవుతాడని అర్థమవుతోంది. గతంలో సైరా టీజర్ రిలీజ్ కే ముంబై వెళ్ళాడు. ఇక అయన క్రేజ్ తమిళంలో పనిచేసి సైరా మీద బాగానే క్రేజ్ ని క్రియేట్ చేస్తుంది. నయనతార, విజయ్ సేతుపతిలు ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి స్టార్ స్టేటస్ ఉన్న నటులు కావడంతో సైరా సినిమా మీద కూడా తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. మరి నయన్, విజయ్ సేతుపతిల మ్యానియా సైరా మీద పనిచేసి అక్కడ మంచి ఓపెనింగ్స్ రాబడితే సైరా తమిళంలో ఖచ్చితంగా సేఫ్ అని ఫిక్సై పోవచ్చు. ముఖ్యంగా సైరాకు భారీగా కలెక్షన్స్ రావాల్సింది తెలుగు, హింది, తమిళంలో అన్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: