మెగాస్టార్ మరియు నయనతార జోడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవి సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా పలు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చాలా రోజుల తరువాత మన టాలీవుడ్ నటిస్తున్న సినిమా సైరా. ఇకపోతే కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు కిచ్చ సుదీప్, భోజ్ పురి నటుడు రవి కిషన్, 

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి మరియు తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు మరొక బాలీవుడ్ సంగీత దర్శకుడు జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ మొత్తం మంచి యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే విజువల్స్ తో అదిరిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ లో మెగాస్టార్ సహా పలు ఇతర పాత్రలు పలికే డైలాగ్స్ అయితే ఎంతో ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 

ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత త్వరలో రిలీజ్ కాబోతున్న సైరా సినిమా ఎంత గ్రాండియర్ గా ఉండబోతోందో మెగా ఫ్యాన్స్ కు అర్ధం అయిపొయింది. అయితే కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఖచ్చితంగా సైరా మంచి విజయాన్ని అందుకుంటుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. కేవలం సాధారణ ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు పలువురు సినిమా ప్రముఖులు సైతం సైరా ట్రైలర్ సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు. మరి మరొక ఇరువై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: