టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హాస్య బ్రహ్మగా పేరుగాంచిన నటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారు. నిజానికి బ్రహ్మానందం గారు ఏదైనా ఒక సినిమాలో ఉన్నారంటే చాలు, ఆయన చేసే కామెడీ కోసమే సినిమాకు వెళ్లేవారు కొందరు ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకుల్లో ఆ విధంగా తన హాస్యపు జల్లులతో చెరగాని ముద్ర వేసుకున్న బ్రహ్మానందం గారు, ఇటీవల తనకు హార్ట్ సర్జరీ జరిగిన కారణంగా సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం నుండి ఆయన మెల్లగా బయటకు రావడం, అలానే ఇటీవల కొన్ని సినిమా ఫంక్షన్లకు కూడా హాజరవడం జరిగింది. 

ఇక ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మాత్రం బ్రహ్మానందం గారు నటించలేదు. అయితే మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో బ్రహ్మానందం గారు ఒక మంచి కామెడీ క్యారెక్టర్ లో నటించినట్లు సమాచారం. ఇక ఇటీవల వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్, తాను లాస్ట్ డే షూటింగ్ సమయంలో బ్రహ్మానందం గారితో కలిసి భోజనం షేర్ చేసుకుంటున్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయడంతో ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నటిస్తున్నట్లు కొంత క్లారిటీ వచ్చింది. 

అయితే ఆయన ఎటువంటి పాత్ర చేస్తున్నారు, ఆ పాత్ర సినిమాలో ఎంతసేపు ఉంటుంది అనేది మాత్రం తెలియరాలేదు. ఇక ఈ సినిమాతో పాటు బ్రహ్మానందం గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా నటిస్తన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మళ్ళి నటనలోకి రీఎంట్రీ ఇస్తోంది మాత్రం వరుణ్ తేజ్ వాల్మీకి ద్వారానే అని అంటున్నారు. మరి కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రహ్మానందం గారు, ఏ విధంగా తన నవ్వులతో మనల్ని అలరిస్తారో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: