మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి పై ఇప్పటికే మన తెలుగు ప్రేక్షకులతో పాటు పలువురు ఇతర భాష ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉండడంతో, నిర్మాత రామ్ చరణ్ సహా ఈ సినిమా యూనిట్ మొత్తం కూడా తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ప్రేక్షకుల అంచనాలు అందుకుని తీరుతాం అని ధీమాగా ఉన్నారట. దానికి కారణం, సినిమాలోని కథ మరియు కథనాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిని తాకుతాయని, ఇక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించారు అనడం కంటే, ఉయ్యేలవాడ నరసింహారెడ్డి గారి పాత్రలో జీవించారని అంటోంది సినిమా యూనిట్. ఇక మెగాస్టార్ తో పాటు ఆయన భార్య సిద్దమ్మగా నయనతార, 

అవుకు రాజుగా కిచ్చ సుదీప్, రాజా పాండి గా విజయ్ సేతుపతి, వీరా రెడ్డిగా జగపతి బాబు, లక్ష్మి గా తమన్నా, ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో అనుష్క శెట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర పోషించిన నటీనటులు, ఎంతో సహజమైన నటనను కనబరిచారట. ఇకపోతే ఈ సినిమాలో అత్యద్భుతమైన విజువల్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్ మరియు ఫైట్స్ ఉండనున్నట్లు మనకు ట్రైలర్ ని బట్టి చూస్తే కొంతవరకు అర్ధం అవుతుంది. అయితే సినిమా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వచ్చే అండర్ వాటర్ ఫైట్ కు ఆడియన్స్ ఎంతో కనెక్ట్ అవుతారని, ఇక మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ గా వచ్చే అతి పెద్ద వార్ సీన్, టోటల్ సినిమాకు అతి పెద్ద హైలైట్ అని అంటున్నారు. 

ఇక ఈ ఒక్క ఫైట్ కోసం సినిమా యూనిట్ మొత్తం రేయింబవళ్లు ఎంతో శ్రమటోడ్చి దీనిని తెరకెక్కించిందని, రేపు తెరపై ఈ ఫైట్ ని చూసే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని అంటోందట సైరా యూనిట్. ఒకరకముగా ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే యుద్ధం ఎపిసోడ్ మరొక ఎత్తని అంటున్నారట. ఇక ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ అయితే ఉప్పొంగిపోతూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి రేపు రిలీజ్ తరువాత సైరా ఎంతటి విజయాన్ని అందుకుని అటు యూనిట్ కి, ఇటు మెగా ఫ్యాన్స్ కు ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: