నాగార్జున పొలంలో మృతదేహాం దొరికిన వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.    మీడియా వర్గాలలో వస్తున్న వార్తల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో ఒక అజ్ఞాత వ్యక్తి మృత దేహం దొరికి నట్లు వార్తలు వస్తున్నాయి. 

దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకల గూడులా ఉంది అని తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున ఈ విషయం పై నిపుణులను అక్కడకుపపినట్లు తెలుస్తోంది. 

అయితే నాగార్జున పంపిన ఆ వ్యక్తులకు పొలంలోకి వెళ్లిన తర్వాత ఒక ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహం కనిపించినట్లు సమాచారం. దీనితో షాక్ అయిన వారు పోలీసులకు వెంటనే నాగార్జునకు పోలీసులకు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వెంటనే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ పంపినట్లు తెలుస్తోంది. 

పోలీసులు ఇప్పటికే ఈ విషయమై విచారణ చేయడానికి క్లూ టీమ్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆ శవం దొరికిన గదిని సీజ్ చేసి తాళం వేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు ? ఎప్పుడు మరణించాడు ? ఎవరు చంపారు ? అన్న కోణంలో దర్యాప్తు వేగా చేసినట్లు తెలుస్తోంది. ఇదే ఫామ్ హౌస్ లో కొంతకాలం క్రితం ఎలట్రిక్ షాక్ కు గురై దంపతులు మృతి చెందిన వార్తలు కూడ గతంలో వచ్చాయి. ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి మృతదేహం దొరకడంతో ఈ విషయం మిస్టరీగా మారి పోలీసులు ఆ పొలంలో పనిచేస్తున్న అందరినీ విచారిస్తూ అన్ని కోణాలలో తమ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు నాగార్జున స్పందించ లేదు అని తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: