సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు సినిమా అవకాశాలు లేకుంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి డేటింగ్ లో ఉంటారు. అలా చూసుకుంటే.. చాలా మంది హీరోయిన్లు కూడా అదే చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు శృతిహాసన్, త్రిష, ఇలియానా లాంటో పెద్ద స్టార్లు సైతం బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగి చివరికి బోర్ కొట్టిందేమో గాని బ్రేకప్ చెప్పేసుకొని మళ్ళీ సినిమాల్లోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 


అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సినిమాలలో వచ్చిన హీరోయిన్లు చాలా వరకు ఒకటో, రెండో సినిమాలతో సరిపెట్టుకున్న వారే. ఆ కోవకు చెందిన ఈ భామ పేరు కృతికర్బంద.. ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సినిమా తీన్ మార్ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవ్వక పోయిన కూడా ఓ మాదిరిగా ఆడింది. ఇకపోతే ఆ సినిమాలో ఈమె పాత్రకు గుర్తింపు దక్కింది. దానితో వరుస సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ, అది కాస్త రివర్స్ అయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో అడపాదడపా  సినిమాలలో నటించింది. అవి కూడా ఆమెకు పేరును తీసుకురాలేదని చెప్పాలి. 


ఇకపోతే ఈమె ఈ మధ్య సినిమాలలో నటించలేదు. మరో ఇండస్ట్రీకి వెళ్ళిందేమో అనుకున్నారు. బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా.. గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన 'వీరే కి వెడ్డింగ్ ' సినిమాలో పులకిత్ సామ్రాట్ తో కలిసి నటించింది. ఆ సినిమా హిట్ అయ్యింది. అయితే, అప్పటి నుండి ఆమె పులకిత్ తో సాన్నిత్యంగా ఉండనే వార్తలు బాలీవుడ్ లో వినపడుతున్నాయి. 


తాజాగా పులకిత్ తో డేట్ లో ఉండనే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వారిద్దరూ డేట్ లో ఉన్నారనే వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఆమె కోసం  పులకిత్ దక్షిణ  భారతదేశంలోని వంటలను కూడా తింటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఆ సినిమానే ' పాగల్ పంటి '. ఆ సినిమాలోని ఓ పాత చిత్రీకరణ కోసం ముంబైలో ఆ ఇద్దరు ఉన్నారు. నిజానికి పులకిత్ కు పెళ్లైందట.. భార్యతో విడాకులు కూడా తీసుకున్నారట.  ఆతర్వాత  యామీగౌతమితో డేట్ లో ఉన్నారు.. ప్రస్తుతం కృతి తో ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ కు స్పెషల్ గా గిఫ్టులు పంపడంతో అడ్డంగా దొరికింది. అది కాక వారిద్దరూ డేట్ లో ఉన్నప్పుడు దిగిన ఫోటోల వల్ల అడ్డంగా బుక్ అయింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: