‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ దర్శకుడు అజయ్ భూపతికి చాల అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే దీనికి భిన్నంగా అతడికి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ‘మహాసముద్రం’ అన్న టైటిల్ తో ఒక కథను తయారు చేసుకుని ఎందరో హీరోల చుట్టూ తిరుగుతూ చివరకు రవితేజా వద్దకు చేరుకొని అక్కడ కూడ మాస్ మహారాజ చేతిలో భంగపడ్డాడు. 

దీనితో తీవ్ర అసహనానికి లోనైన అజయ్ భూపతి రవితేజాను ‘చీప్ స్టార్’ అంటూ పరోక్షంగా కామెంట్ చేసి సంచలన వార్తలకు చిరునామాగ మారాడు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడ ఈ దర్శకుడుకి అక్కినేని కాంపౌండ్ సపోర్ట్ లభించడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు తాను ఇప్పటికే వ్రాసుకున్న ‘మహాసముద్రం’ కథను మల్టీ స్టారర్ మూవీ కథలా మార్చి ఆ కథను నాగచైతన్య అఖిల్ కు సరిపోయే విధంగా చేసి ఈమూవీలో వారిద్దరినీ నటింప చేసేలా ఒప్పించి అక్కినేని మల్టీ స్టారర్ గా చేస్తున్న ప్రయత్నాలు వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ పేరుకు నిర్మిస్తున్నా ఈ మూవీ వెనుక నాగార్జున సహాయ సహకారాలు ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ మూవీ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తీసుకు రావడానికి సమంతను ఒక ప్రత్యేక పాత్రలో నటింపచేసి ఈ మూవీకి ఎటువంటి మార్కెటింగ్ సమస్యలు రాకుండా చాల తెలివిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో రవితేజాతో తీవ్ర అవమానాన్ని పొందిన అజయ్ భూపతికి అక్కినేని కాంపౌండ్ సహకారంతో మాస్ మహారాజాకు సరైన సమాధానం చెప్పే అవకాశం దొరికింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..    
 



మరింత సమాచారం తెలుసుకోండి: