హీరో గోపి చంద్ ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా విజయాలు  లేక అవస్థలు పడుతున్నా ఆయనకి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. దాదాపు లౌక్యం తర్వత ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రం రాలేదనే చెప్పాలి. అలా వచ్చి ఇలా పోయిన సినిమాలే తప్ప ఒక్క సినిమా కూడా గుర్తుండిపోయేలా లేదు. ఈ తరుణంలో గోపీచంద్ తిరు దర్శకత్వంలో "చాణక్య" అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ సినిమా టీజర్ మొన్ననే విడుదల అయింది. ఈ టీజర్ కి నెటిజన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో గోపీచంద్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. గడ్డం పెంచి మ్యాచో మ్యాన్ లా కనిపిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇదిలా ఉండగా గోపీచంద్ మరీ చిత్రాన్ని ప్రకటించాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఓ మూవీ చిత్రీకరణ ప్రారంభించారు. మణిశర్మ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.


ఇదే నిజమైన పక్షంలో కాజల్ తో గోపీచంద్ చేస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. కాగా నేడు మరో సినిమాని కూడా ప్రకటించాడు.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో డైరెక్టర్ సంపంత్ నంది దర్శకత్వంలో ఆయన మరో చిత్రానికి సిద్ధమయ్యారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గౌతమ్ నంద చిత్రం రావడం జరిగింది. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మరి ఈసారైనా వీరిద్దరి కాంబినేషన్ లో హిట్ సాధిస్తారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: