యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కొత్త రకం టెన్షన్ వేదిస్తోంది..బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ‌ప్రభాస్ ఆ స్టేటస్ నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సివస్తుంది. ఎన్నో అంచనాలతో చేసిన "సాహో" అనుకున్న రేంజ్‌లో అంచనాలు అందుకోలేకపోయింది. ఆ సినిమా ఇప్పటికే నాలుగువందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినా కూడా హిట్ అని చెప్పుకోలేని పరిస్థితి. ఆ సినిమాకి అయిన ఓవర్ బడ్జెట్ వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

సాహో ఫలితం విషయంలో అందరికి కూడా షేర్ ఉంది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కాలి అని మాత్రమే అనుకున్న ప్రభాస్ దాని స్పాన్‌ని అంచనా వెయ్యలేకపోయాడు.ప్రభాస్ ఒప్పుకున్నాడు కాబట్టి సినిమాని లావిష్‌గా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోనే ఈ సినిమాని నిర్మించారు ప్రొడ్యూసర్స్. కానీ అనవసరమయిన వాటికి ఖర్చు తగ్గించుకోవడం అనే విషయంలో ఫెయిల్ అయ్యారు.సాహో సినిమా ప్రభావం దర్శకుడు సుజిత్ పైన చాలా పడింది,సామాజిక మాధ్యమాలలో ఆయన పై విమర్శలు వెల్లువెత్తాయి.

కానీ బాలీవుడ్లో మాత్రం సాహో ని అదరహో అంటూ అక్కున చేర్చుకున్నారు.సుజిత్ కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి..ఆ తప్పులు మళ్లీ జరగకూడదు..అందుకే ప్రభాస్ నెక్స్ట్ సినిమా 'జాను' (వర్కింగ్ టైటిల్) విషయంలో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో ముఖ్యమైనది స్క్రిప్ట్ ఛేంజ్..  పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న 'జాను' స్క్రిప్ట్‌లో చాలా ఛేంజెస్ అవసరం అవుతున్నాయట.

అందుకే అవసరమయితే ఇప్పటివరకు తీసిన సినిమా ఫుటేజ్ మొత్తాన్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్‌గా సినిమా స్టార్ట్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని జాను టీం మొత్తంచాలా కష్టపడి జాగ్రత్తగా స్క్రిప్ట్ ను తయారు చేసుకుంటున్నారు..ఇక డార్లింగ్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఏం చేద్దాం స్టార్ హీరోలకి తప్పని సరికొత్త తిప్పలు ఇవన్నీ..


మరింత సమాచారం తెలుసుకోండి: