దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోలతో సమానమైన క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న ఏకైక హీరోయిన్ నాయనతార. ఆమె వయసు 33 సంవత్సరాలు దాటిపోయినా ఎంతోమంది క్రేజీ  హీరోయిన్స్ నుంచి పోటీ ఎదురౌవుతున్నా ఆమె రేంజ్ తగ్గడంలేదు సరికదా ఆమె పారితోషికం సినిమా సినిమాకు పెరిగిపోతూనే ఉంది.

ఇలాంటి పరిస్థితులలో ఆమె పారితోషిక విషయంలో ఆమె అనుసరిస్తున్న ఒక విచిత్రమైన పద్ధతి పై ఇప్పుడు  ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆమె చిరంజీవితో లేటెస్ట్ గా నటించిన ‘సైరా’ కు సంబంధించి 6 కోట్ల పారితోషికం తీసుకుంటే ఆమె ప్రస్తుతం రజినీకాంత్ తో నటిస్తున్న ‘దర్బార్’ మూవీకి నాలుగు కోట్లు మాత్రమే తీసుకుందట. 

దీనికి కారణం ఆమె టాప్ హీరోయిన్ స్టేటస్ కు ఎదగని సమయంలో ఆమెను ‘చంద్రముఖి’ మూవీలో ఎంపిక చేసే విషయంలో రజినీకాంత్ అప్పట్లో ఆమె పట్ల అబ్యంతరం చెప్పక పోవడంతో అప్పటి నుండి రజినీకాంత్ అంటే నయనతారకు ఒక ప్రత్యేకమైన గౌరవం అని అంటారు. ఇలా ఆమె నటించే తెలుగు సినిమాలకు ఒక విధంగా తమిళ సినిమాలకు మరొక విధంగా నయనతార తన పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని టాక్. 

అయితే ఇక్కడే ఒక షాక్ ఇచ్చే విషయం ఉంది. తెలుగు తమిళ నిర్మాతల దగ్గర ఇలా భారీ మొత్తాలు తీసుకునే నయనతార మళయాళ సినిమాల విషయంలో మాత్రం చాల ఉదారంగా ఉంటుందని టాక్. ఎవరైనా ఒక మంచి దర్శకుడు మంచి కథతో ఆమె దక్కరకు వస్తే మళయాళంలో సినిమాను చేయడానికి కేవలం ఆమె ఒక కోటి రూపాయలు మాత్రమే తీసుకుంటుందని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె మాతృభాష అయిన మళయాళం పట్ల ఉన్న మమకారం. అయితే ఆమె వెంటపడే తెలుగు తమిళ రంగాల పట్ల మాత్రం ఆమెకు ఎటువంటి అభిమానం లేదట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: