మరో రెండు వారాల్లో మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతుంది. దాదాపు 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ట్రైలర్లోని విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. సైరా థియేట్రికల్ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. 
 
టాలీవుడ్ లో ఈ సినిమాకు బాగానే క్రేజ్ వస్తుంది కానీ బాలీవుడ్ లో సైరా సినిమాకు ప్రమోషన్స్ పెంచాల్సి ఉంది. సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నప్పటికీ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేస్తే మాత్రమే బాలీవుడ్ లో క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. సైరా సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవటం సమస్యగా మారింది. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు హిట్ కావటం, భారీగా ప్రమోషన్స్ చేయటం వలనే ప్రభాస్ సాహో సినిమాకు విడుదలకు ముందే బాలీవుడ్ లో క్రేజ్ వచ్చింది. 
 
సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉంది కాబట్టి సైరా ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సి ఉంది. సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లో జరగబోతుంది. పవన్ కళ్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. హీరోయిన్ నయనతార కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు సమాచారం. 
 
అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, అనుష్క ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసం 45 కోట్ల రూపాయలు ఈ సినిమాకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు 125 కోట్ల రూపాయలకు అమ్ముడయినట్లు సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: