టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఛలో సినిమా తర్వాత వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. అయినా మళ్ళీ సొంత బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఏ హీరో అయినా ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో సినిమా చేస్తారు. మహా అయితే 2 సినిమాల్ని వరుస గా చేస్తూ వస్తారు. కానీ నాగశౌర్య మాత్రం ఒకేసారి 4 సినిమాలు ఓకే చేశాడు. ఇప్పటికే 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో 2 సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇవి చాలక ఇప్పుడు మరో సినిమాను కూడా ఓకే చేశాడు. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అయింది. 

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు శౌర్య. ఈ సినిమాకి సంబంధించి తాజా  అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. గతంలో నాగచైతన్యతో సినిమా అంటూ ఈమె పేరు వార్తల్లోకెక్కింది. కాని ఎందుకనో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు కూడా అదే కథ, ఆవిడే డైరక్టర్. కాకపోతే హీరో మాత్రం నాగచైతన్య కాకుండా నాగశౌర్య తో సిద్దమయింది.

ప్రస్తుతం రమణతేజ దర్శకత్వంలో సొంత బ్యానర్ లో 'అశ్వద్ధామ' టైటిల్ తో సినిమా చేస్తున్నాడు శౌర్య. ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' అనే టైటిల్ తో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'పార్థు' అనే సినిమాకు ఇంతకముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మూడు సినిమాలతో దర్శకురాలిగా పరిచయమవుతున్న లక్ష్మీసౌజన్య సినిమా కూడా యాడ్ అయింది. 

వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని లేటెస్ట్ న్యూస్. 2020 సమ్మర్ ఎట్రాక్షన్ గా మే నెలలో సినిమాను రిలీజ్ చేస్తారు. దీన్ని బట్టి చూస్తే పార్థు కాస్త ఆలస్యం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో దూకుడు మామూలుగా లేదని అందరు అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: