మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. ఈ సినిమా కోసం  మెగా అభిమానులంతా  ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు.  అయితే బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖలకు  సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ముఖ్యంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి అలాగే అమితాబ్ ఫ్యామిలీకి అండ్ అమీర్ ఖాన్ కి మరియు కొంతమంది ప్రముఖలకు  ప్రత్యేకంగా త్వరలో స్పెషల్ షో వేయనున్నారని తెలుస్తోంది.  ఇక చాలా కాలం నుండి సల్మాన్ ఖాన్  సైరా గురించి తన స్పందనను తెలియజేస్తూ ఉన్నారు.  అలాగే  స్టార్ డైరెక్టర్  రాజమౌళికి ప్రత్యేకంగా  స్పెషల్ షో వేయనున్నారు.  శనివారం నాడు  రాజమౌళికి ప్రసాద్ ల్యాబ్ లో ఈ ప్రత్యేక  షో వేస్తారట.  మొత్తానికి రాజమౌళి నుండి ఈ సినిమా అవుట్ ఫుట్ కి  సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని  సైరా మేకర్స్ భావిస్తున్నారు.  ఇక ఈ చిత్రం  ట్రైలర్  విడుదల అయి.. సంచలనాలను సృష్టిస్తోంది.  భారీ అంచనాలకి తగ్గట్లుగానే భారీ తారాగణంతో భారీ విజువల్స్ తో ట్రైలర్ నెటిజన్లను  బాగా ఆకట్టుకుంది.  కాగా ఈ ట్రైలర్  అన్ని భాషలలో కలుపుకుని కేవలం 24 గంటల్లో ఏకంగా 34 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించింది.  మొత్తానికి ఈ ట్రైలర్ మెగాస్టార్ స్టార్ డమ్ ఏంటో చూపించింది.  ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన స్క్రీన్ ప్రేజన్సీతో  ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. అలాగే డైలాగ్ లతో పాటు  నటీనటులు గెటప్స్  వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. పైగా  ప్రతి ఫ్రేమ్ అలరించేవిధంగా సాగడంతో పాటు..   ట్రైలర్ లో భావోద్వేగమైన ఎమోషన్స్  ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి.  


కాగా  మెగా అభిమానులు  సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తున్నారు.  ఎలాగూ సాహో  ఫీవర్ తగ్గిపోయింది కాబట్టి.. సైరాకి పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరుగుతుంది.  ఈ టైంలోనే చిత్రబృందం ప్రచారానికి సంబంధించి  ప్రణాళికలను భారీగా ప్లాన్ చేసుకుని..   సినిమాని  మిగిలిన భాషల్లోకి కూడా బాగా తీసుకువెళ్లాలి.  హిందీలో  సైరాకి బజ్ రావాలంటే ఇంకా అక్కడ ప్రమోషన్స్ ను వేగవంతం చెయ్యాలి. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే  ఖచ్చితంగా  సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ.. సైరా సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు.   ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: