టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలితరం కర్నూలులోని రేనాడు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. 

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లు మరియు ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ పై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం సైరా ట్రైలర్ అదిరిందని, అలానే ట్రైలర్ లో మెగాస్టార్ డైలాగ్స్, విజువల్స్, యాక్షన్ మరియు యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే రేపు రిలీజ్ కాబోయే సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రైలర్ ఎంతో సక్సెస్ కావడంతో సైరా యూనిట్ అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇకపోతే ఈ ట్రైలర్ పై ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు సైతం ముగ్ధులవుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

ఇక కాసేపటి క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సైరా ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు. 'సైరా ట్రైలర్ ఇప్పుడే చూసాను, విజువల్స్ అదిరిపోయాయి, ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది, చిరంజీవిగారు ఇరగదీసారు అంటూ ఎమోజిలు పోస్ట్ చేసారు మహేష్, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, కెమెరామాన్ రత్నవేలు లకు తన తరపున సైరా నరసింహారెడ్డి మంచి విజయాన్ని అందుకోవాలని ముందస్తు శుభాకాంక్షలు తెలియచేస్తునట్లు తన పోస్ట్ లో తెలిపారు మహేష్ బాబు. మహేష్ బాబు చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: