టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ మొన్న యూట్యూబ్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అదరగొట్టే విజువల్స్,  గ్రాఫిక్స్, సెట్స్, ఆకట్టుకునే నటుల పెర్ఫార్మన్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, యాక్షన్స్ సీన్స్ వంటివి అదరగొట్టడంతో ఈ ట్రైలర్ పై అందరి నుండి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాక దానితో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార జోడి కట్టిన ఈ సినిమాను ఆయన తనయుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సెకండ్ వెంచర్ గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్  బచ్చన్ సహా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు కిచ్చ సుదీప్, 

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, భోజ్ పురీ నటుడు రవి కిషన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా, నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ  పొగడ్తలు కురిపిస్తున్నారు. కేవలం వారు మాత్రమే కాకుండా కొందరు సినిమా ప్రముఖులు సైతం ఈ ట్రైలర్ పై అదరహో అంటూ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిచేస్తున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో మొత్తం అన్ని భాషల్లో కలిపి ఏకంగా 34 లక్షల డిజిటల్ వ్యూస్ ని సాధించి యూట్యూబ్ లో సూపర్ రికార్డ్ ని నెలకొల్పింది. అయితే కేవలం తెలుగు మాత్రమే కాక, 

పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ను ఆయా భాషల ప్రేక్షకులు కూడా ఆధరిస్తుండడం విశేషం. ఇక ట్రైలర్ కు ఇంతటి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో, సైరా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా తప్పకుండా అందరి అంచనాలు అందుకుని మంచి సక్సెస్ సాదిస్తుందని అంటున్నారు. నిన్నటి నుండి ఇంకా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం మరొక గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఇంతటి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతవరకు ప్రేక్షకుల అంచనాలు అందుకుని సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: