మెగా హీరో వరుణ్ తేజ్ , ట్యాలెంటెడ్ డైరెక్టర్  హరీష్ శంకర్  కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం వాల్మీకి  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  మరి కొద్దీ గంటల్లో  విడుదలకానుండగా .. కొద్దీ సేపటి క్రితం ఈచిత్రం యొక్క టైటిల్ ను మారుస్తున్నామని  ప్రకటించింది చిత్ర యూనిట్.  ఈచిత్రానికి  తాజాగా 'గడ్డల కొండ గణేష్' అనే టైటిల్ ను  ఫిక్స్ చేశారు. 



అయితే విడుదలకు ఒక్క రోజు ముందు  ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందటే..   ఈ సినిమా  టైటిల్ వాల్మీకి అని ప్రకటించినప్పటినుండి  టైటిల్ ఫై వివాదాలు  మొదలయ్యాయి.  బోయ హక్కుల పోరాట సమితి  టైటిల్ ను మార్చుకోవాల్సిందిగా   చిత్ర యూనిట్ కు పలు సార్లు సూచించింది. అయినా కూడా వారు వినకపోవడంతో ఆ సమితి ఓ  అడుగు ముందుకేసి  తెలంగాణ హై కోర్టు లో  పిటీషన్  వేసింది. 



దాంతో  కోర్టు  ఈ పిటీషన్ ఫై వివరణ ఇవ్వాల్సిందిగా  చిత్ర యూనిట్ కు షాక్ ఇస్తూ నోటీసులు జారీ చేసింది.  ఇక ఆ వివరణలో  భాగంగా  చిత్ర యూనిట్..  టైటిల్  మారుస్తామని కోర్టు కు తెలిపింది.  దాంతో  ఈచిత్రం యొక్క టైటిల్ వాల్మీకి కాస్త  గడ్డల కొండ గణేష్  అయ్యింది.  కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ  'జిగర్తండా' కు  రీమేక్ గా తెరకెక్కుతున్నవాల్మీకిలో బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్ నటించగా   సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ  హీరో అథర్వ మురళి కనిపించనున్నాడు. వీరికి జోడిగా   పూజా హెగ్డే , మృణాళిని రవి  నటించారు.  14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మించిన  ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: