టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. గతంలో తమిళ్ లో వచ్చిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. పూజ హెగ్డే ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మృణాళిని రవి, అథర్వ మురళి మరొక జోడిగా ఇందులో నటిస్తున్నారు. ఇక ఇటీవల ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి అనే చెప్పాలి. అయితే జిగర్తాండ సినిమాను చాలావరకు మార్చకుండా అలానే తీశామని అయితే, అక్కడక్కడా కొన్ని ముఖ్య సన్నివేశాలు, 

అలానే హీరో వరుణ్ తేజ్  కు సంబందించిన సన్నివేశాలు మాత్రం మార్చి తీయడం జరిగిందని, నేడు దర్శకుడు హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మారుస్తున్నట్లు సినిమా యూనిట్ నిన్న రాత్రి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వాల్మీకి టైటిల్ మార్చాలి అని ఒక సామజిక వర్గం వారు హైకోర్టు లో పిటీషన్  వేయడంతో ఇటీవల చిత్ర యూనిట్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అయితే నోటీసుల పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు, 

సదరు సామజిక వర్గం వారిని ఇబ్బందిపెట్టేలా ఉన్న ఆ టైటిల్ మార్చాలని నేడు ఉత్తర్వులు జారీచేయడంతో, వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని హైకోర్టుకు తెలిపింది చిత్ర యూనిట్. అయితే రేపే సినిమా రిలీజ్ ఉండడంతో ఇప్పుడు టైటిల్ మార్చడం కొంతవరకు సినిమాకు దెబ్బేనంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే దీనిపై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్ ఇప్పుడు మార్చడం వలన కొంతవరకు పబ్లిసిటీ మరియు ఇతరత్రా ఖర్చులు పెరుగుతాయి తప్ప, సినిమాకు పెద్దగా నష్టం ఏమి లేదంటున్నారు. ఎందుకంటే సినిమాలో మంచి కథ, కథనాలు ఉండి, అవి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటే ఇటువంటివి ఆ సినిమా సక్సెస్ కు పెద్దగా అడ్డంకి కావు అని అంటున్నారు. మరి రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు టైటిల్ మార్పు ఎంత మేర లాభనష్టాలు చేకూరుస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: