బిగ్ బాస్ లో గురువారం ఎపిసోడ్ లో గురు శిష్యుల మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్ అందరికీ ఆసక్తిని కలిగించింది. బాబా భాస్కర్, మహేష్ లలో ఇంతవరకు కెప్టెన్ అవని మహేష్ కి ఇంటి సభ్యులు సపోర్ట్ చేసి అతన్ని కెప్టెన్ చేశారు. అయితే ఇక్కడ బాబా భాస్కర్ కొంత నొచ్చుకున్నట్లుగా అనిపించింది. తనకి కెప్టెన్ అవడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ ఇంటి సభ్యులు సపోర్ట్ చేయలేదని మూడీగా ఉన్నాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు.


కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్ కి పిలిచి, వాళ్ళని కలుసుకోవాలంటే మాత్రం చిన్న మెలిక పెట్టడం కంటెస్టెంట్స్ ని షాక్ కి గురి చేసింది. కళ్ళ ముందు కనిపిస్తున్నా కలుసుకోలేకపోతున్నమనే బాధ కంటెస్టెంట్స్ కళ్ళలో కనబడింది. వాళ్ళ కుటుంబ సభ్యులను చూడగానే ప్రతీ ఒక్కరు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీముఖి విపరీతంగా ఏడ్చింది. అయితే బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక టాస్క్ ఇస్తాడు.


ఆ టాస్క్ ప్రకారం ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఉన్న డబ్బాలని ఓపెన్ చేస్తే ఎవరికైతే బిగ్ బాస్ కన్ను వస్తుందో వాళ్ళు మాత్రమే టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి కంటెస్టెంట్స్ ని కలుసుకుంటారని అంటాడు. అయితే గురువారం ఎపిసోడ్ లో వితికా తమ్ముడికి మాత్రమే కన్ను వస్తుంది. మిగిలిన మెంబర్స్ లో ఎవరికి కన్ను వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.  అయితే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది.


అయితే, మొత్తం పదిమందిలో కేవలం ఇద్దరే వాళ్ళ ప్యామిలీ మెంబర్స్ ని కలుసుకుంటారని తెలుస్తుంది. అందర్నీ పిలిచి కేవలం ఇద్దరికి మాత్రమే కలుసుకునే అవకాశం ఇస్తే బాగుండదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.అయితే కేవలం ఆ ఇద్దరికే అవకాశం ఉంటుందా? లేదా అందరికీ అవకాశం ఇస్తాడా అనేది సస్పెన్స్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: