మరో రెండు రోజులలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ మూవీ పాటలు విడుదల కాబోతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ‘సైరా సైరా’ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ మధ్య టైటిల్స్ వస్తాయని తెలుస్తోంది. 

ఈ పాటను తీసేస్తే ఇక కేవలం రెండు పాటలు మాత్రమే ఈ మూవీలో ఉంటాయని అందులో ఒక పాట చిరంజీవి గతంలో నటించిన ‘ఇంద్ర’ మూవీలోని ‘ఘల్లుఘల్లుమని’ అనే పాట తరహాలో ఉంటుందని మరొక పాట తమన్నాతో ఒక డ్యూయెట్ రూపంలో సాంగ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థుతులలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ లో జరిగే ‘సైరా’ ఈవెంట్ కు నయనతార రాను అని చ్పెప్పిందట. అయితే ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి చెన్నైలో అదేవిధంగా కేరళాలో జరిగే రెండు ఈవెంట్స్ కు తాను చిరంజీవితో కలిసి ఆ ఫంక్షన్ లో పాల్గొంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది అని టాక్. 

ఇలా నయనతార నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఒక ఆసక్తికర కారణాన్ని చరణ్ కు వివరించి చిరంజీవికి షాక్ కలిగించినట్లు టాక్. హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కు తాను వచ్చినా రాకపోయినా తేడా ఉండదని అయితే చెన్నైలో అదేవిధంగా కేరళలో జరిగే ఈవెంట్స్ కు తాను రాకపోతే చిరంజీవిని అగౌరవ పరిచినట్లు అవుతుందని అందువల్ల తాను చిరంజీవి గౌరవం నిలపెట్టడానికి తాను ఖచ్చితంగా చెన్నై కేరళ ఈవెంట్స్ కు వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. దీనితో నయనతార ‘సైరా’ ఈవెంట్ కు సంబంధించి చాల తెలివిగా ఇచ్చిన సమాధానం చూసి ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి కూడ షాక్ అయినట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: