డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ హీరో అయ్యాడు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడంతో అయన సినిమాలకు డిమాండ్ పెరిగింది. ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే మినిమిమ్ రూ. 150 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటేనే నిర్మాతలు ముందుకు వచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇటీవలే సాహో సినిమా చేశాడు. ఈ మూవీ విజయం కాకపోయినా.. దాదాపు రూ. 430 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి మెప్పించింది. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.
ప్రస్తుతం జాన్ సినిమా చేస్తున్నాడు. దీని తరువాత సినిమా ఎవరితో అన్నది సస్పెన్స్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ నటించబోతున్నారని తెలుస్తోంది. అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారా అదే అండి రామాయణం. రామాయణాన్ని మూడు భాగాలుగా రూ. 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్న సంగతి తెలిసిందే. దంగల్, మామ్ సినిమాల దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.
సినిమాను ఇప్పటికే అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అయితే, నటీనటుల ఎంపిక జరుగుతున్నది. రాముడిగా హృతిక్ ను ఇప్పటికే ఎంచుకున్నారని సమాచారం. రాముడి తరువాత ఈ సినిమాలో కీరోల్ రావణుడు. రావణుడి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. గాంభీర్యంగా ఉంటుంది. ఈ పాత్రకోసం మొదట ఎన్టీఆర్ ను అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కానీ, ఎన్టీఆర్ చేయడం లేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
రావణుడి పాత్ర కోసం ప్రభాస్ ను సంప్రదించారని, ప్రభాస్ కూడా దానికి ఒప్పుకున్నారని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది. వార్తల్లో వాస్తవాలు ఎంతో తెలిస్తే దాన్ని మనం నమ్మే అవకాశం ఉంటుంది. రావణుడి పాత్ర అంటే విలన్ రోల్. ప్రభాస్ విలన్ గా చేయడానికి ఒప్పుకోవడం అంటే అయన ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్నది చూడాలి. ప్రభాస్ కు ఇండియా వైడ్ గా మార్కెట్ ఉన్నది కాబట్టి ఆ పాత్రకు ప్రభాస్ ను ఒప్పిస్తే సినిమా మరోలా ఉంటుందని అరవింద్ ఆలోచన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.