బుల్లితెర పై టాప్ కామెడీ షో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.. ఈ షో మొదలై దాదాపుగా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ షో లో మొదటి నుండి జడ్జీలుగా వ్యవహర్షిస్తున్న నాగబాబు, రోజమ్మ లు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వారిద్దరు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న టాప్ యాక్టర్స్.. సినిమాలలో చిరంజీవి నుండి బాలయ్య లాంటి పెద్ద హీరోల సరసన నటించిన రోజా ఈ మధ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందన్న విషయం తెలిసిందే. 


అయితే, ఆమె రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇక రాజకీయాలను, సినిమాలను మ్యానేజ్ చేయలేను అని ఫిక్స్ అయిన రోజా సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. కేవలం రెండు రోజులు మాత్రమే పని ఉండి చేతినిండా పైసలు వస్తున్నా జబర్దస్త్ కు జడ్జీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న రోజా.. ప్రతి గురు, శుక్ర వారాల్లో బుల్లితెరపై దర్శనమిస్తూ వస్తుంది. అలా ఐదేళ్ల నుండి బుల్లితెరపై తన హావాను కొనసాగిస్తూ వస్తుంది. 


వివరాల్లోకి వెళితే.. నిన్న జరిగిన జబర్దస్త్ షో లో రోజా సీట్ తో సహా మాయమైంది. ఇంతకీ ఏమైంది మళ్ళీ ఎందుకు  ఈ షో లో కనిపించలేదు అనే వార్తలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. నిజంగానే ఈ షో కి గుడ్ బై చెప్పిందా లేక ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ వేసుకుందా అనే ఆలోచనలో అందరిలోను మెదులుతున్నాయి. కానీ, నిజానికి రోజా రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టిన మాట వాస్తవం. మీటింగ్స్ అని పార్టీ కార్యకలాపాలని బిజీగా ఉన్న రోజా కొంచం గ్యాప్ తీసుకోవాలని అనుకుంది దానితో నిన్న జరిగిన షో లో రాలేక పోయింది. దానితో నవ్వుల బాబు నాగ బాబు ఆ షో ని వన్ మ్యాన్ షో గా కొనసాగిస్తాడు. 


మరో విషయమేంటంటే.. ఈ షో కి అట్రాక్షన్ గా వరుణ్ బాబు, హరీష్ శంకర్, హీరోయిన్ లు వచ్చారు. దీనితో బాబుగారు రష్మీకి మూడు ప్యాంట్, చొక్కాలు కొనిస్తానని అన్నారు. ఆ మాటలు ఇప్పుదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నెక్స్ట్ షో కి కూడా రోజా దూరంగా ఉంటుందా లేక వస్తుందా అనే విషయం ఈరోజు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: