అప్పట్లో డైరెక్టర్ శ్రీను వైట్ల తో మహేష్ బాబు తీసిన ఆగడు సినిమా దారుణంగా ఫ్లాప్ అయి మహేష్ బాబు కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచిపోయింది. ఇటువంటి క్రమంలో ఆగడు సినిమా చేయడం నా కెరీర్లో చాలా పెద్ద మిస్టేక్ అని ఓపెన్ గానే మహేష్ బాబు ఓ సందర్భంలో చెప్పటం జరిగింది. ఇటువంటి క్రమంలో ఆగడు సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర...అంత దారుణమైన డిజాస్టర్ అయినా 'ఆగడు' సినిమాతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాని పోల్చడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో అనిల్ సుంకర కూడా నిర్మిస్తున్నారు.


ఇటువంటి క్రమంలో సోషల్ మీడియాలో తాజాగా అనిల్ సుంకర.. 'ఆగడు'తరహాలో మంచి హైప్ రావాలని కోరుకుంటున్నారు. ‘ఆగడు’కు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ. ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని.. ప్రిమియర్లతోనే 5 లక్షల డాలర్ల మార్కును అందుకున్న తొలి తెలుగు సినిమా అదేనని అనీల్ సుంకర చెప్పారు. ‘సరిలేరు నీకెవ్వరు’కు ‘ఆగడు’ స్థాయి హైప్, ‘దూకుడు’ తరహా కంటెంట్ ఉండాలని తాను కోరుకుంటున్నాను.. మీరేమంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ అభిమానుల్ని ప్రశ్నించాడు అనీల్.


'ఆగడు' సినిమా విడుదలయి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అనిల్ సుంకర ఈ ట్వీట్ చేయడం విశేషం. కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో చాలా శరవేగంగా సాగుతోంది. హీరోయిన్ గా ఈ సినిమాలో రష్మిక మందన నటించగా...సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. కాగా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో…..లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: