సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజాచిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది దాంతో ఈ చిత్రం సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో వేసిన కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించగా ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ కోసం టెంపుల్ సెట్ ను నిర్మించనున్నారని సమాచారం.
ఇక సినిమా షూటింగ్ అనుకున్న డేట్ కంటే ముందుగానే పూర్తి కానుంది . ఆతరువాత ప్రమోషన్స్ కోసం ఎక్కువ టైం కేటాయించనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈసినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలచేయనున్నారని తెలుస్తుంది. కాగా గతంలో మహేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా అదే డేట్ కు విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దాంతో మహేష్ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కోసం మరోసారి ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు. మరి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.
కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. సుమారు 13సంవత్సరాల తరువాత ఆమె మళ్ళీ ఈచిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.