ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయం మీద ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఈసారి కొత్తగా తారక్ ఓ తమిళ దర్శకుడికి ఓకే చెప్పినట్టు టాక్. ఇంతకుముందే ఎన్.టి.ఆర్ తమిళ దర్శకులతో పనిచేయాలని చూసినా వర్క్ అవుట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా కోలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ అట్లీతో తారక్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.


రాజా రాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ తమిళంలో ఇళయదళపతి విజయ్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. తెరి, మెర్సల్ ఇలా విజయ్ తో చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లు అవుతూ వచ్చాయి. లేటెస్ట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో బిగిల్ మూవీ వస్తుంది. సినిమాలో విజయ్ సాకర్ కోచ్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.


ఈ మూవీ తర్వాత అట్లీ ఎన్.టి.ఆర్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందే వీరిమధ్య కథా చర్చలు జరిగాయట. అప్పుడు చెప్పిన లైన్ కే తారక్ ఓకే చెప్పాడట. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎలాగు తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అట్లీతో సినిమా కూడా సౌత్ అంతటా రిలీజ్ చేసే ప్లాన్ తో అతనికి ఓకే చెబుతున్నాడట తారక్.


ఇక ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని టాక్. ఈ మూవీని తెలుగు నిర్మాతలే నిర్మిస్తారట. అట్లీ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తో తారక్ సినిమా అంటే ఆ కాంబో మూవీపై అంచనాలు తారాస్థాయిలో నిలుస్తాయి. ట్రిపుల్ ఆర్ సినిమా 2020 జూలైలో రిలీజ్ అవుతుండగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ముగింపు దశలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ కాంబో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. 


   


మరింత సమాచారం తెలుసుకోండి: