వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే, తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని ప్రధాన పాత్రల్లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ( వాల్మీకి ) గద్దలకొండ గణేష్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించిన జిగర్తాండ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందించిన ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేకోవర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో అయితే ఇండస్ట్రీ, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరికి బ్లాక్ బస్టర్ ఖాయం.. మరో గబ్బర్ సింగ్ అన్న ధీమా బాగా బలపడింది. అనుకున్నట్టుగానే అందరి అంచనాలకు తగ్గట్టుగానే మొదటి షో నుండే హిట్ టాక్ ని తెచ్చుకుంది. 

కాగా విడుదల ముందు రోజు వరకు కూడా వాల్మీకి గా జనాల నోళ్ళలో నానిన పేరు చివరి క్షణంలో మార్చాల్సిరావడం చిత్ర యూనిట్ ని షాక్ కి గురిచేసింది. దీనిపై దర్శకుడు మీడియా సాక్షిగా ఎంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టైటిల్ మార్చడం వలన ఆడియెన్స్ తికమకకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఐతే ఈ సంఘటనపై చిత్ర ప్రముఖులు వాల్మీకి చిత్ర యూనిట్ కి మద్దతు ప్రకటించడం అందరు కలిసి సపోర్ట్ చేయడం గర్వించదగ్గ విషయం. దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో విజయ్ దేవరకొండ అలాగే మరికొందరు,వాల్మీకి టైటిల్ మార్పు పట్ల విచారం వ్యక్తం చేయడంతో పాటు గద్దలకొండ గణేష్ చిత్రం పెద్ద విజయం సాధించాలని తెలిపారు. ఇక 14రీల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిచారు. 

ఇక రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో తనకున్న సత్తాను హరీష్ శంకర్ మరోసారి నిరూపించుకున్నాడు. వరుణ్ మేకోవర్ లో తీసుకున్న నిర్ణయాన్ని, తెరపైన చూపించిన విధానాన్ని అభినందించక తప్పదు. దువ్వాడ జగన్నాథం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక మాస్ ఎంటర్‌టైన్మెంట్ తో వచ్చిన హరీష్ శంకర్ గట్టి హిట్టే కొట్టాడు. అంతేకాదు గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: