తమిళ స్టార్ హీరో సూర్య నటించిన  బందోబస్త్ నిన్న విడుదలై  మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకోవడంతో  మొదటి రోజు ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో  కోటి రూపాయల  షేర్ ను కూడా  రాబట్టలేకపోయింది. గతంలో సూర్య నటించిన ఏ చిత్రానికి  కూడా ఇంత తక్కువ  కలెక్షన్లు రాలేదు. సూర్య కెరీర్లోనే ఈ చిత్రం ఏకంగా 400స్క్రీన్ లకు పైగా విడుదలైయింది. అయినా కూడా మొదటి రోజు మరీ ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడం  బయ్యర్లను టెంక్షన్ కు గురి చేస్తుంది. 



అయితే  ఇటీవల సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద  దారుణంగా బోల్తాపడ్డాయి. దాంతో  తెలుగులో సూర్య మార్కెట్ పడిపోయింది. వీటికి తోడు బందోబస్త్  విడుదలవుతున్న విషయం కూడా చాలా మందికి తెలవకపోవడం  అలాగే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో  ఆ ప్రభావం  కలెక్షన్ల ఫై  పడింది.  ఇక ఈ సినిమాకు పోటీగా  విడుదలైన  వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ కు యూనానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో  ఆచిత్రం  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దాంతో  బందోబస్త్  ఈ  విధంగా  కూడా నష్టపోనుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో  సూర్య కు వున్నా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో  మొదటి రోజు ఈచిత్ర తమిళ వెర్షన్  అక్కడ మంచి వసూళ్లను రాబట్టిందని సమాచారం. అందులో భాగంగా చెన్నై సిటీ లో ఈ చిత్రం మొదటి రోజు 90లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. రంగం ఫేమ్  కేవీ ఆనంద్ డైరెక్షన్ లో  హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  సయేశా సైగల్ కథానాయికగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ  ముఖ్య పాత్రల్లో నటించారు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: