ఇక సూపర్ హిట్ టాక్ వస్తుండడంతో ఈ రోజు , రేపు ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లను క్రాస్ చేసేలా కనిపిస్తుంది. కాగా అటు ఓవర్సీస్ లో కూడాఈ చిత్రం అదరగొడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తే ఆ మొత్తాన్ని రాబట్టడం పెద్దకష్టమేమి కాకపోవచ్చు. పైగా ఈచిత్రానికి ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడం కూడా అడ్వాంటేజ్ కానుంది.
గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం లో వరుణ్ నటన , డైలాగ్స్ , హరీష్ మార్క్ డైరెక్షన్ హైలైట్ అయ్యాయి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా రూపొందిన ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్, సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు.