టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా బుల్లితెరపై రాణిస్తోంది. ఇప్పటికే అనేక టీవీ షోలలో యాంకర్ గా చేసిన మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దపెద్ద కార్యక్రమాలు కూడా యాంకర్ గా చేస్తూ బహిరంగ వేదికలపై చాలా మందిని అలరించింది. ఇటువంటి క్రమంలో తాజాగా మరో కొత్త కార్యక్రమానికి షోకి హోస్ట్ గా రెడీ అవుతుంది. అదే 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్'. త్వరలోనే ఈ షో టెలికాస్ట్ కానుంది.


ఈ సందర్భంగా మంచు లక్ష్మీ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఇటువంటి నేపధ్యంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఇప్పటివరకు చేసిన షో లలో ఇది చాలా ప్రత్యేకమైనదని...ఈ షో చేయడం కోసం కొంత మంది స్టార్స్ ని కలిసిన సందర్భంలో నైట్ డ్రెస్ వేసుకొని రావాలని..చెబితే కొందరు షాక్ అవ్వటం జరిగిందని మరికొందరైతే ఉత్సాహం చూపించారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇటువంటి షోలో బాలీవుడ్ ఇండస్ట్రీలో నార్త్ ఆడియన్స్ కి కామన్ కానీ సౌత్ ఆడియన్స్ కి నచ్చాలంటే తను ఎన్నుకున్నారని...ఈ షో నిర్వాహకులు తనపై ఎంతో నమ్మకం మరియు బాధ్యత పెట్టారని ఖచ్చితంగా వారి నమ్మకాన్ని బాధ్యతని నిలబెట్టేలా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా ఇది రియాలిటీ షో కాదని.. చక్కని ఫన్ గేమ్ లాంటిదని చెప్పింది. ఈ షోని ముందుగా తనకు తెలిసిన సెలబ్రిటీలతో మొదలుపెట్టినట్లు.. అందరినీ ఈ షోలో కలుసుకోవాలనుందని  చెప్పింది. ప్రత్యేకంగా ఎవరినీ ఇష్టం అని చెప్పలేను కానీ రానాని బాగా మిస్ అవుతున్నట్లు చెప్పింది. వెబ్ సిరీస్ లో ఎక్కువగా చూస్తుంటాను కానీ బుల్లితెరపై జరుగుతున్న రియాలిటీ షోలు మాత్రం చూడనని వెల్లడించింది. దీంతో మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: