తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ షో. ఈ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీజన్ త్రి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నట్లు టాక్. దానికి కారణం డల్ కంటెంట్ అనేది టాక్. ముఖ్యంగా వివాదాల కన్న గోల ఎక్కువగా ఉండటంతో...షో ఎక్కువగా టీవీ సీరియల్ టైపు సాగుతోందని షో చూస్తున్న చాలా మంది వీక్షకులు కామెంట్ చేస్తున్నారు. దీంతో టిఆర్పి రేటింగ్ కూడా రోజు రోజుకి క్రమ క్రమంగా తగ్గుతున్నట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు షో కి బూస్ట్ ఇవ్వటానికి తాజాగా ఇప్పుడు కొత్త మార్గాన్ని యాజమాన్యం అన్వేషిస్తోంది.


ఇప్పటికే ఆ మార్గాన్ని షోలో అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే నాని, రమ్యకృష్ణ షో లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆగస్టు నెల చివరిలో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విదేశాలకు వెళ్లిన సందర్భంలో రమ్యకృష్ణ హోస్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. విజయ్ క్రమములో న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు ముందు కూడా నాని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు. దీంతో ఈ రెండు సందర్భాలలో బిగ్ బాస్ షో టిఆర్పి రేటింగ్స్ అమాంతం పేరిగాయట.


ఈ విషయం గమనించిన షో డిజైనర్స్..మరో పెద్ద స్టార్ ని తీసుకువచ్చి ఒక్కసారిగా షోకు క్రేజ్ ని రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వారు రకరకల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీమ్ ప్లాన్ చేస్తున్న వారిలో ఒకరు చిరంజీవి అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కనుక బిగ్ బాస్ స్టేజీపై కనపడితే ఆ కిక్కే వేరు. ఆ రోజు టీఆర్పీలు మామూలుగా ఉండని అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున ప్రయత్నాలు మొదలెట్టారట. సైరా ప్రమోషన్ కోసం చిరుని ఈ షో కు నాగ్ ఆహ్వానిస్తున్నారట. మరి చిరంజీవి హౌస్ లోకి వస్తారో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: