ప్రతీ శుక్రవారం ఎన్నో సినిమాలి విడుదల అవుతుంటాయి. అందులో ఒకటో రెండో మాత్రమే ప్రేక్షకులని అలరిస్తాయి. అన్ని సినిమాలకు పడే కష్టం ఒకేలా ఉన్నా, ఫలితం మాత్రం వేరేగా ఉంటుంది. అందుకని దర్శకులు సినిమాలు చేసేసి, ఫలితం విషయంలో ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతుంటారు. ఇక ఆ సినిమా ఒక స్టార్ హీరోతో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా హీరోల అభిమానుల దర్శకుడిని విమర్శించడం చూస్తూనే ఉంటాం.


అయితే తాజాగా ఒక దర్శకుడు తను తీసిన సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకమంతే ఒకవేళ సినిమా బాలేకపోతే తనని తిట్టండి అని ఓపెన్ గానే ఆఫర్ ఇచ్చాడు. ఆయనే దిలీప్ రాజా. కమెడియన్ ఆలీ హీరోగా దిలీప్ రాజా తెరకెక్కించిన చిత్రం "పండు గాడి ఫోటో స్టూడియో" మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


ఎవరి సినిమా వారికి నచ్చుతుంది. కానీ నచ్చాల్సింది ప్రేక్షకులకు. వారికి నచ్చితేనే అది గొప్ప చిత్రం అవుతుంది. అంతా వారి చేతుల్లోనే ఉంది. నా సినిమా నచ్చకపోతే నన్ను తిట్టండి. సినిమా బాలేదని చెప్పండి. ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకుంటానని అన్నాడు. ఇంకా మాట్లాడుతూ, ఆలీ హీరోగా నేను తెరకెక్కించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమా మంచి కంటెంట్‌తో మీ ముందుకు రాబోతోంది. ఇందులో ఆలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది.


అసలలా పెళ్లిళ్లు ఎందుకు జరుగుతున్నాయో, దానికి సంబంధించిన కారణాలు ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రంలో గొడుగు గోవిందం, చెంబు లింగం, బేడర్థణాగాడు, మెంటల్ మాలచ్చిమి, మిలట్రీమామ వంటి పాత్రలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి. ఈ సినిమా కథనాన్ని దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాం. అందుకే సినిమా మీద నమ్మకంతోనే అలా మాట్లాడని చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: