నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య -నాగ శౌర్య కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఏఎన్నార్ , సావిత్రి కలిసి నటించిన కల్ట్ మూవీ మూగమనసులు అనే టైటిల్ ను పెట్టనున్నారని సమాచారం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు. వచ్చే ఏడాది మేలో విడుదలకానున్న ఈ చిత్రం గురించి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి
ఇక గత ఏడాది ప్రారంభం లో ఛలో తో సూపర్ హిట్ కొట్టిన నాగశౌర్య ఆతరువాత కణం , అమ్మమ్మగారిల్లు , @నర్తనశాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం శౌర్య తనకు ఊహలు గుస గుస లాడే తో విజయాన్ని అందించిన శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓసినిమా చేస్తుండగా ..తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో మరో చిత్రం లో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని ఓ నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాలతోనైనా హిట్ కొట్టి నాగశౌర్య సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.