రోజురోజుకు చిరంజీవి 'సైరా’ పై అంచనాలు పెరిగిపోతున్న నేపధ్యంలో దసరా సీజన్ హవా అంతా ‘సైరా’ తోనే కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో లలో ‘సైరా’ ను కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. దీనికితోడు ఈ మూవీ ట్రైలర్ చూసాక హృతిక్ రోషన్ మూవీ 'వార్' మేకర్స్ సైతం కాస్త ఖంగారు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' ను ఢీకొట్టడానికి ఒక చిన్న తెలుగు సినిమా రెడీ అవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆ మూవీ ‘చాణక్య’ తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో యాక్షన్ హీరో గోపీచంద్  నటించిన మూవీ ఇది. దసరా రేస్ ను టార్గెట్ చేస్తూ ‘సైరా’ విడుదల అయిన కేవలం 3 రోజుల గ్యాప్ లో ఈ మూవీని విడుదల  చేస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈ మూవీని అక్టోబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసారు చేశారు. ప్రస్తుతం గోపీ చంద్ కెరీర్ ఇప్పుడు ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి సమయంలో భారీ అంచనాలున్న చిరంజీవి సినిమాకు గోపి చాంద్ ఎలా ఎదురు వెళుతున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. 'సైరా’ మూవీని అక్టోబర్ 2 బుధవారం విడుదల చేస్తున్నారు. 

ఆతరువాత కేవలం మూడు రోజుల గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 5న గోపీచంద్ మూవీని విడుదల చేస్తున్నారు. వీకెండ్‌ కు వచ్చేసరికి 'సైరా'ను వీరాభిమానులంతా చూసేసి ఉంటారు. అప్పటికి దసరా సెలవులు పైగా వీకెండ్ కాబట్టి రెండు సినిమాలకు స్కోప్ ఉంటుందని సెలవులు ఇంకా వారం రోజులు కొనసాగుతాయి కాబట్టి తమ చిన్న సినిమాకు ఊరికి ఒక సింగిల్ ధియేటర్ దొరికినా చాలు అంటూ ఈమూవీ నిర్మాతలు చెపుతున్న విషయాలు ఇండస్ట్రీ ప్రముఖులను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలే నిజం అయితే మెగా అభిమానుల ట్రోలింగ్ ను గోపీ చంద్ తట్టుకోగలుగుతాడా మరికొందరు షాక్ అవుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: