మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్య అతిథిగా చిరు సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకకు దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది కానీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండమం వలన రాలేకపోతున్నాను అని తెలిపారు .
పవన్ కల్యాణ్ ఈ సినిమా కోసం తనవంతు ప్రచారం చేస్తున్నారు. పవన్ రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సోదరులు, వారి పిల్లలు, ఇతర హీరోలు ఈవెంట్కు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తే కాదనకుండా వస్తుంటారు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్లకు హాజరవడం వల్ల ఎన్నో చిన్న సినిమాలకు మంచి ప్రచారం లభించింది.
ఈ చిత్రంలో హీరోనియెగా నయనతార చిరంజీవి జోడీగా నటించారు.తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్ తదితరులు కీలక పాత్రలుగ నటించపోతున్నారు.సైరా ట్రైలర్ మంచి స్పందన లభించింది. ఇప్పటికే కోటి మందికి పైగా వీక్షించారు. ఒక్క రోజులో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు ట్రైలర్లలో సైరా నరసింహారెడ్డి సినిమా మూడో స్థానంలో నిలిచింది.
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు చాల ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా వేగవంతం అయ్యాయి.