అక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే 'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ కూడా దగ్గర ఉండి సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం దాదాపు సంవత్సరం నుండి అఖిల్ బాబు హీరోయిన్లును చూస్తూ... కియారా అద్వానీ, రష్మీక మండన్నా వంటి హీరోయిన్లను పరిశీలించి.. చివరికీ పూజా హెగ్డేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొంది. ఈ షూట్ లో అఖిల్ - పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు.
మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం పరుశురామ్ - అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. పరుశురామ్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పరుశురామ్ అఖిల్ తో చేయబోయే తన తరువాత సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి. అయితే నిజానికి పరుశురాం చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదు. కానీ పరుశురామ్ - అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా పూర్తవ్వగానే.. పరుశురామ్ - అఖిల్ కాంబినేషన్ లో సినిమా మొదలవ్వనుంది.